Search
Close this search box.
Search
Close this search box.

ఘనంగా దివంగత జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు సాయిబాబా జయంతి

సాయిబాబా

– సాయిబాబా పేరు మీద స్వచ్ఛంద సేవా సంస్థ ప్రారంభించిన తనయుడు

           అమలాపురం, (జనస్వరం) : న్యూ గ్రూప్ అధినేత, మాజీ ఏ ఏం సి డైరెక్టర్, శ్రీదేవి ఆలయ ఉత్సవ కమిటీ ఉపాధ్యక్షులు, అమలాపురం పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు దివంగత పిండి సాయిబాబా 60వ జయంతి కార్యక్రమం అమలాపురం ప్రెస్ క్లబ్ లో సాయిబాబా కుమారుడు పిండి రాజా అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన అమలాపురం మున్సిపల్ చైర్ పర్సన్ రెడ్డి నాగేంద్ర సత్య నాగమణి సత్యనారాయణ దివంగత సాయిబాబా చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ దివంగత సాయిబాబా రాజకీయాల్లోనే కాకుండా నిజ జీవితంలో కూడా ఎందరికో ప్రేమ మానవత్వం ఆప్యాయత తో విశిష్ట సేవలు అందించిన మహోన్నత వ్యక్తి అని ఆయన జ్ఞాపకాలు ఎన్నడూ మరువలేనివని, ఆయనను ఆదర్శం తీసుకోవాల్సిన అవసరం ఉందని, అయన పేరుతో తనయుడు రాజా ఏర్పాటు చేసిన ట్రస్ట్ (సంస్థ) అభినందనీయమన్నారు. అనంతరం మరో ముఖ్య అతిథిగా విచ్చేసిన అమలాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి శెట్టిబత్తుల రాజబాబు చైర్ పర్సన్ రెడ్డి నాగేంద్ర సత్య నాగమణి, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ చిక్కాల వినాయకరావు (గణేష్), వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షులు సంసాని బుల్లినాని, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మోకా వెంకట సుబ్బారావు, తనయుడు పిండి రాజా తో ట్రస్ట్ కు సంబంధించిన పోస్టర్ లను ఆవిష్కరించారు, అదేవిధంగా బుద్ధాల నాగరత్న బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని అమలాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి శెట్టిబత్తుల రాజబాబు ప్రారంభించారు. అదే విధంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ లు మట్టపర్తి నాగేంద్ర, మట్టపర్తి మురళీకృష్ణ, గొవ్వాల రాజేష్, చిత్రాపు రామకృష్ణ, ఆశెట్టి ఆదిబాబు, పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way