Logo
Date of Publish : 22 June 2022, 4:43 pm
Editor : Sake Naresh

కౌలు రైతులను ఆదుకోవడమే జనసేన లక్ష్యం : రేఖ గౌడ్

           ఎమ్మిగనూర్ ( జనస్వరం ) : పల్లె పల్లెకు జనసేన కార్యక్రమంలో భాగంగా పార్లపల్లి, పెసలదిన్నె, ఏనుగు బాల, దైవందిన్నె గ్రామ ప్రజలతో జనసేన నియోజకవర్గ ఇన్చార్జి రేఖ గౌడ్ సమావేశం నిర్వహించి పవన్ కళ్యాణ్ చేస్తున్న రైతు భరోసా యాత్ర సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రేఖ గౌడ్ మాట్లాడుతూ అధికారానికి సంబంధం లేకుండా కౌలు రైతులను ఆదుకున్న ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ అని గుర్తు చేశారు. అధికార ప్రతిపక్షాలు కేవలం మాటలకి విమర్శలకే పరిమితమయ్యారని 151 సీట్ల భారీ మెజారిటీతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం రైతులకు చేసింది ఏమీ లేదని, విమర్శించారు. ఇప్పటికైనా అధికారపక్షం మేలుకోవాలి అని అఖిలపక్షం ఏర్పాటు చేసి రైతు సమస్యలపై ప్రతిపక్ష పార్టీల సూచనలు తీసుకుని సమస్యల పరిష్కారం దిశగా అడుగు వేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జనసేన పార్టీ తరఫున నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల అధికార ప్రతినిధి రాహుల్ సాగర్, ప్రధాన కార్యదర్శి బజారి, రాష్ట్ర చేనేత వికాస్ రాష్ట్ర కార్యదర్శి రవి ప్రకాష్, షబ్బీర్ రాజు ఎల్లప్ప మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com