కోవూరు నియోజకవర్గంలో ఘనంగా జనసేనాని జన్మదిన వేడుకలు

కోవూరు

   కోవూరు ( జనస్వరం ) : జనసేనపార్టీ అద్యక్షులు  పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా కోవూరు నియోజకవర్గం , జొన్నవాడ మహా పుణ్యక్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. దేవాలయంలో 108 టెంకాయలు కొట్టి, పవన్ కళ్యాణ్ గారు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో తులతూగాలని ప్రార్థించడం జరిగింది. జనసేన నాయకులు డా. దాడి అజయ్ మాట్లాడుతూ మాట్లాడుతూ రాష్ట్రములోనే కాకుండా, దేశవ్యాప్తంగా విలక్షణమైన రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ అని కొనియాడారు. తన కష్టార్జితమైన సొమ్మును ఆత్మహత్యలకు పాల్పడిన సుమారు 3000 మంది కౌలు రైతులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చొప్పున ఆర్థిక సాయం ప్రకటించిన సంగతి మనకందరికీ తెలిసిందే. ఇటువంటి అత్యున్నతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటే రాష్ట్రానికి మరియు రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. అంతేకాకుండా” నా సేన కోసం నా వంతు” కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్క జన సైనికుడు తన వంతు ఆర్థిక సహాయాన్ని పార్టీకి అందించాలని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో  జనసేనపార్టీ నెల్లూరుజిల్లా ఉపాధ్యక్షులు బద్దేపూడి సుదీర్ గారు,సునీల్ గారు, శ్రీకాంత్ గారు,మస్తాన్ గారు,విడవలూరు మండలం నాయకులు మల్లి గారు,బాలాజీగారు, బుచ్చి మండల ప్రదాన కార్యదర్శి ఇబ్రహీమ్ గారు, వేణు గారు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way