జనసేనాని వారాహి యాత్ర చరిత్ర సృష్టిస్తుంది : గుర్రాన అయ్యులు

వారాహి

            విజయనగరం ( జనస్వరం ) : జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపడుతున్న వారాహి యాత్ర చరిత్రలో నిలిచిపోయే ఘట్టమని జనసేన నాయకుడు గురాన అయ్యలు అన్నారు. పవన్ కళ్యాణ్ చేపట్టనున్న వారాహి యాత్ర విజయవంతం కావాలని కోరుకుంటూ.. మంగళవారం ఉదయం శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి కోవెలలో గురాన అయ్యలు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గురాన అయ్యలు మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రను ఆపేందుకే వైసీపీ ప్రభుత్వం జీవో నెంబర్ 1ను తీసుకు వచ్చిందని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తోందన్నారు. పవన్‌కు ఉన్న ప్రజాదరణను చూసి వైసీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. పవన్ వారాహి వాహనాన్ని అడ్డుకోవాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని హెచ్చరించారు. ప్రజలే పవన్ కల్యాణ్‌ను ముందుకు నడిపిస్తారని చెప్పారు. ఏపీ ప్రజలను మిగిలిన రాష్ట్రాల ప్రజలు జాలిగా చూస్తున్నారని తెలిపారు. రాజకీయ దొంగలు ప్రజల భవిష్యత్‌ను దోచుకుంటున్నారని విమర్శించారు. ఏపీలో ప్రతీ పౌరుడిపై లక్ష రూపాయల అప్పు ఉందన్నారు. ఏపీ రాజకీయాల్ని మార్చే సామర్థ్యం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కే ఉందన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం పవన్ వల్లే సాధ్యమవుతుందన్నారు.. ఈ కార్యక్రమంలో చేనేత విభాగం రాష్ట్ర కార్యదర్శి కాటం అశ్విని, జన సేన యువ నాయకులు కొయ్యాన లక్ష్మణ్ యాదవ్,లోపింటి కళ్యాణ్, రవీంద్ర,హుస్సేన్ ఖాన్, సురేష్, రామకృష్ణ, కులదీప్,పవన్ కుమార్, ఏంటి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way