నిరుపేదలకు చీరలు పంపిణీ చేసిన జనసేన యువనాయకుడు లోపింటి కళ్యాణ్

లోపింటి కళ్యాణ్

        విజయనగరం ( జనస్వరం ) : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను విజయనగరం 27వ డివిజన్ జొన్నగుడ్డి జనసేన కార్పొరేటర్ అభ్యర్థి లోపింటి రామలక్ష్మి మరియు జనసేన యువనాయకులు లోపింటి కళ్యాణ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం వైభవంగా జరిగాయి. ముందుగా ఈ వేడుకలకు ముఖ్య అతిధిలుగా విచ్చేసిన జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఆదాడ మోహనరావు మరియు జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు త్యాడ రామకృష్ణారావు (బాలు) కేక్ ను కట్ చేసి వేడుకల్ని ప్రారంభించారు. అనంతరం వారి చేతులమీదుగా సుమారు మూడువందలమంది నిరుపేదలకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా వారిరువురు మాట్లాడుతూ ఇటువంటి సేవాకార్యక్రమాలతో పవన్ కళ్యాణ్ ఆశయాలను, సిద్దాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న లోపింటి కళ్యాణ్ ను అభినందిస్తూ, ప్రతీ జనసైనికులు పార్టీ బలోపేతంనకు మరింత కృషిచేయాలని అన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు పిడుగు సతీష్, కొయ్యాన లక్ష్మణ్ యాదవ్, బూర్లి వాసు,శ్రీనువాసు రావు, పత్రి సాయి జొన్నగుడ్డి జనసైనికులు ముక్కి కుమార్,ఆది,సురేంద్ర, రెయ్యి రాజు,బుజ్జి,మోహన్ సాయి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way