పేదల కోసమే పనిచేస్తున్న జనసేన : కృష్ణా జిల్లా జనసేన అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ

        మచిలీపట్నం,  (జనస్వరం) : పేద మధ్యతరగతి ప్రజల కోసమే జనసేన పార్టీ నిరంతరం పనిచేస్తుందని కృష్ణా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ  గారు అన్నారు. మచిలీపట్నం జనసేన పార్టీ కార్యాలయములో  జనసేన క్రియాశీల సభ్యులు కిట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆశయ సాధన ప్రకారం పార్టీ ముందుకు వెళుతుందన్నారు. క్రియాశీల సభ్యులు మరణించినట్లయితే 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్‌, గాయాలైతే 50 వేలరూపాయలు 24 గంటల్లో అందజేయడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. జనసేన పార్టీ సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం చేస్తుందన్నారు. ప్రజల గుండెల్లో రోజురోజుకీ  జనసేన పార్టీ ఆదరణ పెరుగుతుందని అన్నారు. అధికార ప్రతినిధి లంకిశెట్టి బాలాజీ గారు  మాట్లాడుతూ  నేటి ప్రజా వ్యతిరేక రాష్ట్ర విధానాల పట్ల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, ప్రజలు జనసేనని గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు గడ్డం రాజు జనసేన పార్టీ నాయకులు వంపుగడవల చౌదరి, సమీర్‌ నాలుగో వార్డు కార్పొరేటర్‌ పినిశెట్టి ఛాయా దేవి,వేణు, పెద్ద యాదర సర్పంచి గళ్ళ తిమోతి, నరేష్‌ సమీర్‌, జనసైనికులు తదితురులు పాల్గొన్నారు.