క్యాన్సర్ బాధితురాలికి నిత్యావసర సరుకులు అందించిన జనసేన బృందం

        అరకు ( జనస్వరం ) : నియోజకవర్గ కేంద్రం పరిధిలోగల మాడగగడ పంచాయితీ పరిధిలోన గల బెంజిపుర్ గ్రామంలో  క్యాన్సర్ తో లక్ష్మి  బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక జనసేన నాయకులు పరామర్శించారు. అనంతరం బాధితురాలికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ బాధితురాలిని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.  ఈ కార్యక్రమంలో సాయిబాబా దురియా, రామకృష్ణ, అలంగి, రాజ్ భారత్ తదితరులు పాల్గొన్నారు.