Search
Close this search box.
Search
Close this search box.

విశాఖ ఉక్కు కార్మికులకు అండగా జనసేన : రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ

విశాఖ ఉక్కు

        విశాఖపట్నం ( జనస్వరం ) : ఎందరో ప్రాణ త్యాగాలతో ఏర్పాటైన విశాఖ స్టీల్ ప్లాంట్ ను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం తగదని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పరుచూరి భాస్కరరావు అన్నారు. ఉక్కు కార్మికులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా త్వరలో విశాఖకు రానున్న జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పర్యటనను జనసైనికులు అందరూ విజయవంతం చేయాలి అని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన రాష్ట్ర జనసేన ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ను పవన్ కళ్యాణ్ గారు మొదటిలోనే ఖండించి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారని అన్నారు. పవన్ కళ్యాణ్ గారు విశాఖ పర్యటనకు అనకాపల్లి జనసైనికులతో పాటు ఉక్కు కార్మికుల కుటుంబ సభ్యులు సైతం పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way