Search
Close this search box.
Search
Close this search box.

కబ్జా భూములు విడిపించే వరకూ జనసేన పోరాటం ఆగదు : జనసేన నియోజకవర్గ ఇంఛార్జ్ గేదెల చైతన్య

కబ్జా

     పాతపట్నం, (జనస్వరం) : పాతపట్నం నియోజకవర్గంలోని అధికార పార్టీ నాయకుల అండదండలతో కబ్జాకు గురైన గవర్నమెంట్‌ హైస్కూల్‌ ఆటస్థలాన్ని కబ్జాదారుల చెర నుంచి విడిపించాలని జనసేన నియోజకవర్గ ఇంఛార్జ్  గేదెల చైతన్య డిమాండ్‌ చేశారు. ఆల్‌ ఆంధ్ర రోడ్డు జంక్షన్లో జనసేన నాయకులు మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. అనంతరం పాతపట్నం తహనీల్దారుకు గేదెల చైతన్య వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాతపట్నంలో కబ్జాకు గురైన భూములు విడిపించే వరకూ జనసేన పార్టీ పోరాటం చేస్తుందని సృష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పాతపట్నం మండల నాయకులు నక్క క్రాంతికుమార్‌, సిరిపురం సందీప్‌, తలగాపు నవీన్‌, శిష్టు వినోద్‌కుమార్‌, భాస్కర్‌, సురేష్‌ మాధవరావు, దుక్క బాలరాజు, సవలావురం చంటి, సవర రామమూర్తి, పిట్ట హరికృష్ణ, నియోజకవర్గ జనసైనికులు మరియు తదితురులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way