ప్రజా సమస్యల పరిష్కారం కోసమే జనసేన పోరాటం : జనసేన నాయకులు గంధం ఆనంద్

   మధిర, (జనస్వరం) : ప్రజా సమస్యల పరిష్కారం కోసం జనసేన పార్టీ ముందుండి పోరాటాలు నిర్వహిస్తుందని మధిర నియోజక వర్గం జనసేన పార్టీ విద్యార్థి విభాగ కార్యనిర్వహక సభ్యుడు గంధం ఆనంద్ అన్నాడు. శనివారం మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రధానంగా యవతకు ఇచ్చిన వాగ్దానాలలో ఏ ఒక్కటి అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు పరిష్కారం చేయడమే పవన్ కళ్యాణ్ గారి ఆశయమని ఈ సందర్భంగా అన్నారు. అంతేకాకుండా సమస్య ఎక్కడ అయితే ఉంటుందో జనసేన పార్టీ ముందు ఉండి సమస్యలు తీరుస్తాము. అనేక సంవత్సరాలు తెలంగాణ కోసం బలిదానాలు చేసి సాధించుకున్న రాష్ట్రంలో యువతులకు మిగిలింది ఏమీ లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానంగా రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయి అనుకున్న వారి ఆశలు నిరాశలుగానే మిగిలింది అని అన్నారు. రెండో సారి జరిగిన ఎన్నికల ముందు నిరుద్యోగ భృతి ఇస్తామున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు నీటి మూటలుగా ఉన్నాయన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత వారి సమస్యలు రాష్ట్రం పరిష్కారం చేయలేదని దుయ్యబట్టారు. తెలంగాణలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం జనసేన పార్టీ ముందు అడుగు వేస్తుందని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way