అనారోగ్యంతో బాధపడుతున్న జనసేన కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన జనసైనికులు
టెక్కలి మండలంలోని నర్సింగ పల్లి గ్రామం జనసైనికుడు తోట శ్యామ్ చెల్లెలు పూర్ణమ్మ శస్త్ర చికిత్స నిమిత్తం జనసేన పార్టీ NRI శ్రీ ధవళ వెంకటగిరి బాబు గారు ₹5000/- ఆర్ధిక సహాయం చేశారు. శుక్రవారం నాడు జనసేన పార్టీ టెక్కలి నియోజకవర్గ నాయకులు కూరాకుల యాదవ్, అట్టాడ శ్రీధర్ లు 5 వేలు నగదు మొత్తాన్ని ఆమె కుటుంభ సభ్యులకు ఇంటివద్ద అందజేశారు. జనసేన పార్టీ ప్రతి పేద కుటుంబానికి ఆపదలో అండగా ఉంటుందని ఈ సందర్భంగా నాయకులు యాదవ్, శ్రీధర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ అభ్యర్థి రాయి సునీల్, హనుమంతు దిలీప్, పాసుపురెడ్డి సోమేశ్, సంజు రెడ్డి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.