చీపురుపల్లిలో ఇంటింటికి జనసేన సిద్దాంతాలు

చీపురుపల్లి

      చీపురుపల్లి ( జనస్వరం ) : చీపురుపల్లి మండలం కారకం పంచాయతీ కారకం గ్రామంలో  గ్రామ జనసైనికులు ఆధ్వర్యంలో 7వ రోజు జనవాణి – జన చైతన్య యాత్ర చేపట్టారు.  గ్రామంలో ప్రతి గడపకు పవన్ కళ్యాణ్  సిద్ధాంతాలను ఆశయాలను, మేనిఫెస్టో తీసుకెళ్లడం జరిగింది. ముఖ్యంగా రైతులు పండించే పంటకి ధర మరియు గిడ్డంగులు కల్పించమని, వెళ్లిన ప్రతి ఇంటిలో చాలా సమస్యలు వివరించారు. పరిష్కరించమని గ్రామ ప్రజలు వారి సమస్యలను తెలియపరిచారు. అలాగే గ్రామంలో మాకు ఊహించని అశేషమైన ప్రజల స్పందన లభించిందని అన్నారు.  ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ కు ఒక అవకాశం ఇద్దాం అనే మాటే వినిపిస్తుందని అన్నారు. గ్రామం మొత్తం ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు సహకారం లభించినందున పవన్ కళ్యాణ్ తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఇలాగే మిగిలిన నియోజకవర్గంలో ఉన్న గ్రామాల్లో కూడా పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను, జనసేన ఆశయాలను సామాన్య ప్రజల కోసం ఆయన ఏం చేస్తారో అన్నది ప్రతి ఒక్కరికి తెలియజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి గణేష్, మహంతి భాషా, కురుమినెల్లి గోపి,గుడ్ల అనిల్, యలకల రాంబాబు,యాలకల గోవింద్, చీపురుపల్లి నియోజకవర్గం జనసైనికులు పెద్ది వెంకటేష్, బోడసింగి రామకృష్ణ, గేడ్డి గొల్లబాబు, చందక బాలకృష్ణ, బాకూరి శ్రీను, లెంక జగదీశ్ , రామునాయుడు,పైడితల్లి, గిడిజాల చిరంజీవి, విసినిగి శ్రీను, రౌతు కృష్ణవేణి, మరియు జనసైనికులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way