Logo
Date of Publish : 30 January 2023, 11:12 am
Editor : Sake Naresh

వినుతా కోట ఆధ్వర్యంలో దయనేడు గ్రామంలో జనసేన శ్రమదానం

         శ్రీకాళహస్తి ( జనస్వరం ) : శ్రీకాళహస్తి నియోజకవర్గం, తొట్టంబేడు మండలం దయనేడు గ్రామానికి బస్సు సౌకర్యం లేదని గ్రామస్థులు జనసేన పార్టీ దృష్టికి శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్చార్జి వినుత కోటా గారు KNOW MY CONSTITUENCY కార్యక్రమం లో భాగంగా పర్యటించినప్పుడు తెలిపారు. ఆ గ్రామం కి వెళ్ళే దారి గుంతలమయం అయినందున బస్ రాకపోకలకు నిలిపివేయడం జరిగింది. అధికారుల దృష్టికి జనసేన పార్టీ తీసుకుని వెళ్ళినా జిల్లా కలెక్టర్, మండల అధికారులు స్పందించక పోవడంతో జనసేన పార్టీ నాయకులు ,జనసైనికులు నియోజకవర్గ ఇంఛార్జి వినుత కోటా గారి ఆధ్వర్యంలో ఈరోజు శ్రమదానం చేసి కలవకుంట నుండి దయనేడుకు వెళ్లే 2 కి.మీ రోడ్డులో ఉన్న గుంతలను పూడ్చి బాగుచేయడం జరుగుతుందని అన్నారు.  రోడ్డుకు ఇరువైపులా అడ్డుగా ఉన్న చెట్లను తొలగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తొట్టంబేడు మండల అధ్యక్షులు కొప్పాల గోపి, శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు దండి రాఘవయ్య, శ్రీకాళహస్తి పట్టణ అధ్యక్షుడు భవాని శంకర్, నాయకులు రవి కుమార్ రెడ్డి, నితీష్ కుమార్, గణేష్, గాంధీ, బాలాజీ, కాటేశ్, వెంకటరమణ, గిరీష్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com