Logo
Date of Publish : 06 February 2022, 3:53 pm
Editor : Sake Naresh

ప్రజా సమస్యల పరిష్కారానికై ఒంగోలులో జనంలోకి జనసేన కార్యక్రమం

    ఒంగోలు ( జనస్వరం ) : ప్రజా సమస్యల పరిష్కారానికై జనసేన పార్టీ జనసైనికులు తలపెట్టిన జనంలోకి జనసేన అనే కార్యక్రమం ఒంగోలులోని 38 మరియు 39 డివిజన్లలో నిర్వహించారు. దీనిలో భాగంగా స్థానిక సమస్యల గురించి అక్కడ నివసించే ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా డివిజన్ లలో త్రాగునీటి సమస్య ఎక్కువగా ఉందని నాలుగు రోజులకు ఒకసారి వాటర్ ట్యాంకర్ వస్తుందని వచ్చిన ఇంటికి ఐదు నుంచి పది బిందెలు మాత్రమే ఇస్తున్నారన్నారు. ఇంటి అవసరాలకు సరిపడా నీరు ఇవ్వడం లేదని కనీసం స్థానికంగా ఉన్న బోర్లు బోర్లు కూడా బాగు చేయడం లేదని వాపోయారు సైడ్ కాలవలు కూడా లేక ఎక్కడ మురుగునీరు అక్కడే ఆగిపోయి నానా ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. అంతేకాకుండా ఇంటి స్థలాలు కూడా ఇక్కడ వారికి లేవని సొంత ఇల్లు లేని పేదలమైన మేము ఇంటి అద్దె కూడా కట్టుకోలేని ఈ పరిస్థితుల్లో ఉన్నామని గతంలో చెల్లించిన ₹500 జి ప్లస్ త్రీ ఇళ్లను ఇప్పటివరకూ కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు బండారు సురేష్, ఈదుపల్లి గిరి గౌరీశంకర్, గారా నారాయణ రత్నాకరం సాయి పర్చూరు సాయి, చాకిరి శీను, హరీష్, ఉంగరాల మోహిత్, వడ్డీ రాజేష్, హర్ష నాగరాజు, సుబ్బారావు, హరి పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com