
మదనపల్లె ( జనస్వరం ) : జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు ఆధ్వర్యంలో మదనపల్లి జనసేన సీనియర్ నాయకులు దారం హరిప్రసాద్, ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత అధ్యక్షతన సిటియం పంచాయతీ కామిగాని పల్లి, కొత్త వారి పంచాయతీ చిలకవారి పల్లి, గాజులవారి పల్లెలో ప్రతి ఇంటికి జనసేన కార్యక్రమం జరిగింది. పవన్ కళ్యాణ్ ఆశయాలు, జనసేనపార్టీ సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో మదనపల్లె జనసేన నాయకులు కోటకొండ చంద్రశేఖర్, పట్టణ ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్ రెడ్డి, స్టూడెంట్ వింగ్ బారె కిరణ్ కుమార్, పవర్ ఆఫ్ ద టీం అధ్యక్షులు గుమ్మిశెట్టి గోపాలకృష్ణ, సిటిఎం జనసేన నాయకులు గంగాధర, వెంకటేష్, వినోద్ , ద్వారక నాగరాజు మహేష్ వీర మహిళలు పాల్గొన్నారు.