CG రాజశేఖర్ ఆధ్వర్యంలో వెల్దుర్తి మండలంలో జనసేన ప్రజా పోరాట యాత్ర

          పత్తికొండ ( జనస్వరం ) : వెల్దుర్తి మండలంలోని గ్రామాల్లో జనసేన నాయకుడు నాయకుడు CG రాజశేఖర్ పర్యటించారు. ఆయన మాట్లాడుతూ జనసేన ప్రజా పోరాట యాత్ర ద్వారా, ఈరోజు బుక్కాపురం, కలగొట్ల, కృష్ణాపురం, గ్రామాలలో అనేక సమస్యలు కళ్ళారా చూశామని,  గ్రామాలలో ఈ వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యమని అన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారం లోకి, వచ్చిన తర్వాత గ్రామాలలో త్రాగునీరు చాలా ఇబ్బందికరంగా ఉందని, గ్రామస్తులు చెబుతున్న ఆవేదన బాధ మాకు అర్థమైంది, కానీ ప్రభుత్వంలో ఉన్న నాయకులకు ఎందుకు అర్థం కావడం లేదని అన్నారు. ప్రజలు తాగు నీటి కోసం ఇబ్బంది బాధపడుతున్నారని అన్నారు. ఎమ్మెల్యే శ్రీదేవి గారు ఇచ్చిన హామీ ప్రకారం ఈ గ్రామస్తులు సమస్యలు తీర్చాలని జనసేన పార్టీ తరుపున కోరుతున్నామని అన్నారు. గ్రామాలలో సిసి రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ చాలా అధ్వానంగా ఉన్నాయని, వీటి పైన దృష్టి పెడితే బాగుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వెల్దుర్తి మండల నాయకులు, పుల్లగుమ్మి పరమేష్, ఆగిపోగు నాగరాజు, నాయకల్ బాబ్జి, బడల్లా ఆదెన్న, జనసేన నాయకులు కాల్వ భాస్కర్, గద్దల రాజు, చాకలి నాగేశ్వరరావు, ఈడిగ చిరంజీవి, నరసింహుడు, ఆది, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way