జనసేన పిఠాపురం ఇంచార్జ్ మాకినీడు శేషుకుమారి ఆధ్వర్యంలో జనసేన పార్టీలోకి చేరికలు
రాజకీయాల్లో యువత ఆవశ్యకత అవసరమని ముందుకు రాణించేలా కృషిచేయాలని యువతరం నవతరంతోనే మార్పు సాధ్యమని జనసేనపార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇంచార్జి మాకినీడి శేషుకుమారి అన్నారు.ఉ.కొత్తపల్లి, జనసేన పార్టీ సిద్దాంతలకు ప్రజలు, నాయకులు ఆకర్షితులై పవన్ కళ్యాణ్ ఆశయాలు నెరవేర్చాలని ఆయన అడుగు జాడలో ప్రయణించడానికి ఎంతో మంది సిద్దపడుతున్నారు అని పిఠాపురం జనసేన ఇన్ ఛార్జ్ మాకినీడి శేషుకుమారి గారు అన్నారు. జనసేన నాయకులు మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి చెందాలంటే యువతలో ప్రశ్నించేతత్వం రావాలని అప్పుడే అవినీతి జరగకుండా పారదర్శకంగా అభివృద్ది పనులు సక్రమంగా జరుగుతాయని తెలిపారు. నేటి వ్యవస్థ మార్పుకోసం జరుగుతున్న ఉద్యమాల్లో యువతరమే సింహాభాగంగా సాగుతుందని భావి భారత నిర్మాణం యువత చేతుల్లోనే ఉందని గుర్తుచేశారు. దేశానికి యువత ప్రధాన సంపద బలమైన ఆయుధం లాంటి వారని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేప్పట్టిన విశాఖలో తలపెట్టిన లాంగ్ మార్చ్ పవన సభలు జరగడానికి కారణం యువకులే అని ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు యువత ప్రాముఖ్యతను గుర్తించేలా పనిచేస్తారని అన్నారు. ఉ.కొత్తపల్లి మండలం యండఫల్లి గ్రామం నుంచి సుమారు 28 మంది టిడిపి నుంచి జనసేన పార్టీలో చేరడం జరిగింది అని ఆమె తెలిపారు. మాకినీడి శేషుకుమారి ఆధ్వర్యంలో గుండ్ర దుర్గాప్రసాద్ సమక్షంలో పార్లమెంట్ PAC సభ్యులు పంతం నానాజీ కాకినాడ రూరల్ ఇంచార్జ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. G. అనిల్, అవినాష్, భవన్ నారాయణ, జి అర్జున్ కె వీరబాబు గాది గోపి, తోట ప్రసాద్, గొల్లపల్లి వీరబాబు మర్రి దొరబాబు కోలా ప్రసాద్ శ్రీనివాస్ జనసైనికులు, తదితరులు పాల్గొన్నారు.