విక్కుర్తి అంజినేయుల కుటుంబానికి జనసేనపార్టీ తరుపున అండగా ఉంటాం : జనసేన నాయకులు బోనబోయిన, గాదె

    గుంటూరు, (జనస్వరం) : ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యనికి బలైనా విక్కుర్తి ఆంజనేయులు కుటుంబాన్ని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, ఉపాధ్యాక్షులు అడపా మాణిక్యాలరావు పరామర్శించారు. ఆంజనేయుల చిత్రాపటానికి పూల మాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని కలెక్టర్, రెవిన్యూ శాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే తన ప్రాణాలు పోగొట్టుకున్నాడని శ్రీనివాస్ అన్నారు. అధికారులను తక్షణమే విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి జనసేనపార్టీ తరుపున అండగా ఉంటామని హామీ ఇవ్వడం జరిగింది. ప్రజలకు న్యాయం చెయ్యాల్సిన అధికారులు, అధికార పార్టీ నాయకులకు వత్తాసు పలుకుతూ చివరకు ప్రాణాలు తీసే స్థాయికి దిగజరిపోయారని జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు అన్నారు. ఇది ఆత్మహత్య కాదని పూర్తిగా ప్రభుత్వ అధికారుల హత్యేనని అన్నారు. విక్కుర్తి ఆంజనేయులు కుటుంబానికి త్వరగా ఆర్థిక సహాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భవిష్యత్ లో ఆ కుటుంబానికి అన్నివిధాలుగా అండగా జనసేన పార్టీ ఉంటుందని హామీ యిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అడపా మాణిక్యాలరావు, యర్రంశెట్టి వేణు, యర్రంశెట్టి సూర్యనారాయణ, శిఖా బాలు, యుగందర్, గంగరాజు, నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way