స్పందించిన మున్సిపల్ అధికారులకు జనసేన పార్టీ కృతజ్ఞతలు : జనసేన నాయకులు తోట సాయి కుమార్

మున్సిపల్

       బాపట్ల పట్టణంలో మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉన్న రోడ్డులో చెత్త పేరుకుపోయిన విషయాన్ని జనసేన పార్టీ మీడియా మిత్రుల దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకు వచ్చిన విషయం అందరికి తెలిసినదే. అయితే ఈ విషయంలో అధికారులు వెంటనే స్పందించి ఆ పరిసరాలను మొత్తం శుభ్రం చేపించినందుకు బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలియచేస్తుంది. బాపట్ల నియోజకవర్గంలో ఉన్న సమస్యల మీద ఎప్పటిలాగానే బాపట్ల జనసేన పార్టీ జనసైనికుల సహకారంతో ప్రజలు ఇబ్బంది పడుతున్న ప్రతి సమస్యని అధికారుల దృష్టికి తీసుకువెళ్లే విధంగా ప్రణాళికాబద్దంగా మరింత ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అతి ప్రధానంగా బాపట్ల పట్టణంలోని శానిటరీ వ్యవస్థమీద ప్రత్యేక దృష్టి పెడతామని జనసేన నాయకులు తోట సాయి కుమార్ గారు అన్నారు. కావున సంబంధిత అధికారులు కూడా శానిటరీ వ్యవస్థ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టవలసిందిగా కోరుకుంటున్నాము అని అన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way