Logo
Date of Publish : 10 August 2021, 4:36 pm
Editor : Sake Naresh

చేనేతకారుల బలోపేత లక్ష్యంగా జనసేన పార్టీ అడుగులు

   ఎమ్మిగనూరు, (జనస్వరం) :   ఇటీవలే జనసేన పార్టీ ప్రకటించిన చేనేత వికాస్ రాష్ట్ర కమిటీలో ఎమ్మిగనూరు నియోజకవర్గం తరఫున రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన కాసా.రవి ప్రకాష్ గారిని జనసేన పార్టీ కార్యాలయం నందు మండల అధికార ప్రతినిధి రాహుల్ సాగర్, ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర చేనేత వికాస్ కార్యదర్శి కాసా.రవి ప్రకాష్ గారు మాట్లాడుతూ తనను నమ్మి రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నుకోవడం పట్ల జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్  గారికి,  నియోజకవర్గ ఇంఛార్జ్ రేఖా గౌడ్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా తనకి ఇచ్చిన ఈ బాధ్యతని చేనేత కార్మికుల అభివృద్ధి కోసం కృషి చేస్తానని, చేనేత కార్మికుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పని చేస్తానని తెలిపారు. అనంతరం జనసేన పార్టీ మండల అధికార ప్రతినిధి రాహుల్ సాగర్, జనసేన వెంకట్, రషీద్ గార్లు  మాట్లాడుతూ ఇంత వరకు ఏ ప్రభుత్వాన్ని చూసినా చేనేత కార్మికులను కేవలం ఓట్ బ్యాంక్ కొరకే వాడుకున్నారని, చేనేతలకు గుర్తింపు ఇచ్చిన ఏకైక పార్టీ జనసేన అని వారు గుర్తు చేశారు.  ఈ కార్యక్రమంలో, తిమ్మప్ప, వాసు, రమేష్, వీరేష్, చిన్న, తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com