Search
Close this search box.
Search
Close this search box.

కౌలు రైతులకు 2 లక్షల రూపాయలు విరాళం ఇచ్చిన జనసేనపార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి పోలసపల్లి సరోజ

    కాకినాడ, (జనస్వరం) :  జనసేనపార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయానికి తోడుగా రైతులకు అండగా కాకినాడ ప్రథమ మేయర్, జనసేనపార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి పోలసపల్లి సరోజ రైతులను ఆదుకునే విధంగా తన వంతు బాధ్యతగా జనసేనపార్టీకి 2 లక్షల రూపాయలను మంగళవారం నాడు మంగళగిరి పార్టీ ఆఫీస్ నందు పార్టీ అధ్యక్షులు వారు ఎదుట ప్రకటించిన విషయం విధితమే. ఆ విషయమై జనసేనపార్టీ అకౌంట్ ద్వారా పార్టీకి అందజేయడం జరిగింది. మన పార్టీ అధినేత చేపట్టిన ఈ బృహత్కార్యంలో మేముసైతం ప్రథమంగా భాగస్వామ్యం అవ్వడం చాలా ఆనందాన్ని కలిగిస్తుందన్నారు. అధినేత చేసిన, చేస్తున్న విరాళాలు మమ్మల్ని ఎప్పటికప్పుడు ప్రభావితం చేస్తూనే ఉంటాయి, మరింత స్పూర్తిని కలుగజేస్తూ ఉంటాయని అన్నం పెట్టే రైతన్న ను ఆదుకోవాలి అని సంకల్పించిన పవన్ అన్నకు తోడుగా ఉండే క్రమంలో అవకాశం ఉన్న ప్రతీవారు భాగస్వామ్యం కావాలని ఆమె ఈ సందర్భంగా తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way