జనసేన పార్టీ రాష్ట్ర ప్రోగ్రాం కమిటీ తరుపునపేద విద్యార్థులకు ఆర్థిక సహాయం

జనసేన పార్టీ

          నెల్లూరు ( జనస్వరం ) :  నెల్లూరు నగరంలోని స్థానిక పొదలకూరు రోడ్డు బేతల్ విలాంగణి స్కూల్ నందు జనసేన పార్టీ రాష్ట్ర ప్రోగ్రాం కమిటీ చైర్మన్ కేకే ఆదేశాల మేరకు పాఠశాల నందు ఆర్థిక ఇబ్బందులతో విద్య సాగిస్తున్న సంధ్య, స్రవంతి, విద్యార్థినిలకు చేయూతగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రోగ్రాం కమిటీ కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో 20 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఇద్దరు విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు పరీక్షల కొరకు పరీక్షా సామాగ్రి ని అందజేశారు. తదనంతరం వారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు భవిష్యత్తులో పేద విద్యార్థులకు జనసేన పార్టీ అన్ని రకాలుగా ఆదుకుంటుందని తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులు పవన్ కళ్యాణ్ కు అభినందనలు తెలియజేశారు. తల్లిదండ్రులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు సుజయ్ బాబు, కొట్టే వెంకటేశ్వర్లు, సత్యనారాయణ, రమేష్, ఆదిశేషయ్య , కుమార్ షాకీర్, భీమ, స్కూల్ ప్రిన్సిపల్, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way