Logo
Date of Publish : 08 November 2021, 3:41 pm
Editor : Sake Naresh

ప్రజలందరి చూపు జనసేన వైపు ~ జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి

    విజయనగరం, (జనస్వరం) : జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విజయనగరం ఇంచార్జ్ శ్రీమతి పాలవలస యశస్వి గారు తలపెట్టిన గ్రామ గ్రామాన జనసేన కార్యక్రమాన్ని విజయనగరం నియోజవర్గంలో చెల్లూరు గ్రామంలో ఆదివారం ఉదయం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయాన్నే చెల్లూరు గ్రామంలో జనసేన నాయకులు బోబ్బాది చంద్ర నాయుడు ఇంటింటికి జనసేన సిద్ధాంతాలతో కూడిన కరపత్రాలను పంచిపెట్టి అనంతరం గ్రామ గ్రామాన కార్యక్రమంలో భాగంగా పాలవలస యశస్వి గారు ప్రజాధర్భార్ నిర్వహించారు. ప్రజాసమస్యలను తెలుసుకుంటూ, అర్హులైన కొందరికి ప్రభుత్వ పథకాలు అందని వారినుంచి వినతులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలందరూ వైస్సార్సీపీ అరాచకాలను ఎండగడుతున్నారని, వారు చెప్పినట్లు చేయకపోతే పెన్షన్లు, ఇల్లులు ఆపేస్తామని బెదిరింపు రాజకీయాలు చేస్తున్నారని, రాష్ట్రంలో ప్రభుత్వంపై ఏ సమస్యలపైనైనా పోరాడడంలో జనసేన పార్టీ చేయడాన్ని చూసి ప్రజలందరి చూపు జనసేన వైపు ఉందని, ప్రజలందరూ భవిష్యత్ లో జనసేన పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బొబ్బాది చంద్ర నాయుడు, ఎజ్జాడ సాయి, సత్తిబాబు, స్వామి, నాయుడు, సాయి, మురళి, నాగరాజు, శ్రీను, శ్రావణ్, సూరిబాబు, త్యాడ రామకృష్ణారావు(బాలు) పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com