మదనపల్లి జిల్లా కోసం ఆమరణ నిరాహారదీక్ష చేపట్టిన నాయకులకు మద్దతు తెలిపిన జనసేనపార్టీ కార్యదర్శి దారం అనిత

    మదనపల్లి, (జనస్వరం) : మదనపల్లి జిల్లా సాధన JAC ఆధ్వర్యంలో ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు చేస్తామని ప్రకటించిన రోజు నుండి ఈ రోజు వరకు పలు రకాల నిరసన కార్యక్రమాలు మదనపల్లెలో చేపట్టారు. ఈ కార్యక్రమాలకు జనసేన అదే విధంగా వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు మద్దతు పలికుతున్నారు. ఈ రోజు మదనపల్లి జిల్లా కోసం BSP రాష్ట్ర ఉపాధ్యక్షులు బందెల గౌతమ్, జనసేన వివిధ రాజకీయ పార్టీలు బస్టాండ్ లో ఆమరణ నిరాహార దీక్షకు మద్దతు ఇవ్వడం జరిగింది. అలాగే జనసేనపార్టీ ఇతర రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఏర్పాటు చేసిన దీక్షా శిబిరాన్ని పోలీసులు ధ్వంసం చేశారు. దీనిని నిరసిస్తూ మదనపల్లి జిల్లా సాధన జేఏసీ సభ్యులు, బందరు గౌతం తన స్వగృహంలోనే ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోవడం జరిగినది. మదనపల్లి జిల్లాగా ప్రకటించి అంతవరకు మదనపల్లె జిల్లా ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపడుతూనే ఉంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అదేవిధంగా నిరాహార దీక్ష చేపట్టిన బందెల గౌతమ్ కు జనసేన చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత సంపూర్ణ మద్దతు ఇస్తూ దీక్షలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి జిల్లా జేఏసీ సభ్యులు, జిల్లా సాధన జేఏసీ సభ్యులు, ప్రజా సంఘాలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way