Search
Close this search box.
Search
Close this search box.

పాలకొండలో జనసేన పార్టీ రైతు భరోసా యాత్ర పోస్టర్లు విడుదల

రైతు భరోసా యాత్ర

            శ్రీకాకుళం ( జనస్వరం ) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుల బాధలతో, నష్టాలతో నిండా మునిగి ఎటు వెళ్ళాలో తెలియక ఆత్మహత్యే మార్గం అని చనిపోయిన కౌలు రైతుల కుటుంబాలకు అండగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు నేను ఉన్నాను అని భరోసా ఇచ్చి లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేసి గొప్ప మనసును చాటుకున్నారు. దీనికి అండగా టీం పిడికిలి రాజా మైలవరపు సహాయ సహాకారoతో ఈ రైతు భరోసా యాత్ర ప్రజలకు చేరువయ్యేలా పాలకొండ నియోజకవర్గo లోని నాలుగు మండలాలకు పోస్టర్స్, స్టిక్కర్లను పంపిణీ చేయడం జరిగింది అని *టీమ్ పిడికిలి కోఆర్డినేటర్ మత్స పుండరీకం అన్నారు. 2024 లో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలనే దిశగా టీం పిడికిలి రాజా మైలవరపు ఎంతో కృషి చేస్తున్నారు. జనసైనికులు సమన్వయంతో పనిచేసి రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీని అధికారంలోకి వచ్చే విధంగా కృషిచేయాలి అన్నారు. అనంతరం గోడలకు వాల్ పోస్టర్లు, ఆటో లకు స్టిక్కర్లు అతికించారు. పై కార్యక్రమంలో వీరఘట్టం మండలం టీమ్ పిడికిలి కోఆర్డినేటర్ కర్ణేన సాయి పవన్, బబ్బది పకీరు నాయుడు, పొట్నూరు దుర్గాప్రసాద్, కడగల హరికృష్ణ, దనుకొండ సందీప్ , రౌతు గోవింద రావు, కోడి వెంకటరావు నాయుడు, కంటు మురళి, అన్ను రామకృష్ణ, తదితర జనసేన నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way