సుండుపల్లె లో పించ ప్రాజెక్టు పరిశీలించిన జనసేనపార్టీ శ్రేణులు

సుండుపల్లె లో పించ ప్రాజెక్టు పరిశీలించిన జనసేనపార్టీ శ్రేణులు

                  కడప చిత్తూరు జిల్లాల సరిహద్దుల్లో బహుదానది పైన 1960లో పించా ప్రాజెక్ట్ను రైతుల శ్రేయస్సు కొరకు తాగునీరు సాగునీరు సస్యశ్యామలంగా ఉండుటకు నిర్మించడం జరిగింది. నీవర్ తుఫాన్ కారణంగా గురువారం రాత్రి చిత్తూరు జిల్లాలో కురిసినట్టు వంటి భారీ నుంచి అతి భారీ వర్షాలకు వచ్చిన వరద నీరు పెద్ద పెద్ద చెట్లు చెత్తాచెదారం వరద నీటిలో కొట్టుకు రావడంతో గేట్ల కు అడ్డు తగలడంతో వరద నీటి ప్రవాహం విపరీతమై డ్యాంకు కుడివైపున ఉన్న మట్టికట్ట సుమారు 120 నుండి 150 మీటర్లు వరద నీటి ప్రవాహం లో కొట్టుకు పోవడం జరిగింది. దీనికంతటికీ కారణం చిత్తూరు జిల్లా మరియు కడప జిల్లా అధికారుల టెలీకమ్యూనికేషన్స్ సరిగ్గా లేనందువలన ఈ ఘోరం జరిగిపోయింది. జరిగి మూడు రోజులు అవుతుంది కేవలం సందర్శనతో చేతులు దులుపు కుంటున్న అధికారులు మరియు అధికార పార్టీ నేతలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు వరద నీటికి వచ్చినటువంటి చెత్తాచెదారం గేట్లకు అతుక్కుని ఉంది. డ్యాం పైభాగమున చెట్లు చీమలు చెత్తాచెదారం అలాగే ఉంది ఇంతవరకు ఎలాంటి పనులు మొదలు పెట్టలేదు. ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ సుండుపల్లి మండల స్థాయి నాయకులు మరియు భారతీయ జనతాపార్టీ నాయకులు రాజంపేట జనసేన పార్టీ పార్లమెంటరీ ఇంచార్జి మరియు దక్షిణ రాయల కోస్తా పార్లమెంటరీ కమిటీ మెంబర్ సయ్యద్ ముకర్రం చాన్ ఆధ్వర్యంలో పర్యవేక్షించిన డం జరిగింది. సుమారు డ్యాం కు సంబంధించి సుమారు 30 కోట్ల రూపాయల నష్టం వాటిల్లి ఉంటుందని, అదేవిధంగా వరద నీటి ప్రవాహానికి దిగువ స్థాయి ఉన్న ఊర్లు కొట్టుకోవడం జరిగింది. ప్రభుత్వం వెంటనే రైతులకు జరిగిన నష్టాలను ఫుల్ ఫీల్ చేయు విధంగా ప్రణాళికలు రూపొందించాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది. పవన్ రావాలి పాలన మారాలి అనే నినాదంతోటి ప్రజలకు ఎళ్లవేళలా అందుబాటులో ఉండే పార్టీ జనసేన పార్టీ ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రామశ్రీనివాసులు, మండల నాయకులు అచుల రామ, మహిళా నాయకురాలురెడ్డిరాణి, బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యుడు వెంకటరామరాజు బిజెపి మండల అధ్యక్షుడు రామ జగదీష్ జనసేన నాయకులు ఓబులేసు,సలీమ్,రవీంద్ర, మడితాడు రఫీక్ తదితరులు పాల్గొన్నారు.