మత్స్యకార అభ్యున్నతి యాత్రని ప్రారంభించిన జనసేన పార్టీ ప్రచార కార్యదర్శి బాబు పాలూరు

    పార్వతీపురం, (జనస్వరం) :  మత్స్యకారుల కష్టాలు, వారు పడుతున్న బాధలు, ప్రభుత్వం నుంచి వారికి ఎటువంటి సహాయం అందుతుందో లేదో అని తెలుసుకోవడం కోసం పార్వతీపురం నియోజకవర్గం బలిజిపేట మండలంలోని నూకలవాడ గ్రామంలో మత్స్యవికాస విభాగం సంకల్పంతో మత్స్యకార అభ్యున్నతి యాత్రని జనసేన పార్టీ ప్రచార కార్యదర్శి బాబు పాలూరు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతి గ్రామంలో పర్యటించి ప్రతి ఇంటికి వెళ్లి వారి కష్టాలను తెలుసుకోవడం జరిగింది. ఈ నెల 20వ తేదీన జనసేనపార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నరసాపురంలో చేపట్టిన మత్స్యకార అభ్యున్నతి సభను మన కోసం పెట్టబోతున్నారని ఆ సభకు స్వచ్చందంగా లక్ష మంది మత్స్యకారులు పాల్గొంటున్నారని అలాగే మన ప్రాంతం నుండి కూడా ఆ సభకు మద్దతు తెలిపి విజయవంతం చెయ్యాలని కోరారు. ఈ కార్యక్రమంలో బలిజిపేట జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way