Logo
Date of Publish : 30 March 2022, 4:18 pm
Editor : Sake Naresh

జనసేన పార్టీ పీఏసీ సభ్యులు పంతం నానాజీని కలిసిన చెరుకు రైతులు

     కాకినాడ, (జనస్వరం) : తుని నియోజకవర్గనికి చెందిన కొంతమంది చెరకు రైతులు యొక్క సమస్యలను జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి తెలియచేయాలనీ కోరుతూ ఈరోజు సూరంపాలెం చెరకు రైతులు కాకినాడలో జనసేన పార్టీ పీఏసీ సభ్యులు పంతం నానాజీని కలిసి వారియొక్క సమస్యలను తెలియజేశారు. నానాజీ రైతులతో మాట్లాడి వివరాలను తెలుసుకుని ఈ సమస్యను పార్టీ పెద్దలదృష్టికి తీసుకువెళ్తానని వారికి హామీ ఇచ్చారు. విశాఖ జిల్లా పాయకరావుపేట ప్రాంతంలో గల తాండవ షుగర్ ఫ్యాక్టరీకి తూర్పుగోదావరి జిల్లాలోని ప్రత్తిపాడు, తుని నియోజకవర్గాల పాయకరావుపేట, నర్సీపట్నం ప్రాంతాలకి చెందిన సుమారు 4000 మంది రైతులకు 18 నెలల నుండి 8 కోట్ల బకాయిలు చెల్లించాల్సివుంది. అంతే కాకుండా ఇప్పుడు రైతు లదగ్గర నుండి చెరకు పంటను తీసుకోవడం లేదు. దానివల్ల దూర ప్రాంతానికి తక్కువ ధరకి తీసుకువెళ్తున్నారు. దానివలన రైతులు పూర్తిగా నష్టపోతున్నారు. రాష్ట్ర కోపరేటివ్ మంత్రి దీనిపై సమగ్ర విచారణ చేసి చెరకు రైతులకు న్యాయం చేయాలని, వ్యవసాయ శాఖకు ఎలాగూ న్యాయం చేయలేదు. కనీసం చెరకు రైతులని ఆదుకోవాలని జనసేనపార్టీ తరుపున పంతం నానాజీ డిమాండ్ చేయడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com