Search
Close this search box.
Search
Close this search box.

ఎమ్మిగనూరు చెన్నకేశవ కాలనీ డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని జనసేన పార్టీ నాయకులు వినతిపత్రం

ఎమ్మిగనూరు

          కర్నూలు ( జనస్వరం ) : ఎమ్మిగనూరు పట్టణంలో 30 వ వార్డు చెన్నకేశవ కాలనీలో నెలకొన్న డ్రైనేజ్ సమస్యలను పరిష్కరించాలంటూ స్పందన కార్యక్రమంలో మున్సిపాలిటీ కమిషనర్ కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర చేనేత విభాగం రాష్ట్ర కార్యదర్శి రవి ప్రకాష్, మండల అధికార ప్రతినిధి రాహుల్ సాగర్ లు మాట్లాడుతూ కాస్త వర్షానికి కాలనీ మొత్తం జలమయం అవుతుందని దీనివల్ల కాలనీలో నివసిస్తున్న వృద్ధులు దివ్యాంగులు చాలా అవస్థలు పడుతున్నారని ఇదే కాకుండా వర్షపు నీళ్లు ఆగడం వల్ల కాలనీవాసులకు డెంగు మలేరియా లాంటి విషజ్వరాల బారిన పడుతున్నారని అన్నారు. కనుక అధికారులు ఇప్పటికైనా స్పందించి కాలనీవాసుల సమస్యలను పరిష్కరించాలని అని కోరారు. ఈ కార్యక్రమంలో కర్ణం రవి, రమేష్, వినయ్, గోపి, ప్రసాద్, పవన్, చిన్న, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way