ఆచంట నియెజికవర్గంలో 100 మంది వరద బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ చేసిన జనసేనపార్టీ నాయకులు
ఆచంట నియెజికవర్గంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో జనసేనపార్టీ పర్యటించి, అక్కడ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుని, మొదట విడతగా భీమలాపురం గ్రామంలో ఎటుగట్టు లోపల నివసిస్తున్న సుమారు 100 కుటుంబాలకు జనసేన నాయకులు మల్లినీడి తిరుమల రావు గారి ఆర్థిక సహాయంతో నిత్యావసర సరుకుల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ నరసాపురం పార్లమెంట్ వర్కింగ్ కమిటీ సభ్యులు చిట్టూరి శ్రీనివాస్, షేక్ అలీ, జవ్వాది బాలాజీ, అడ్డాల దుర్గారావు మాట్లాడుతూ గత వారం రోజులుగా లంకప్రాంత ప్రజలు జలదిగ్భందం లో ఉన్నారని, వారికి కనీస అవసరాలైన త్రాగునీరు, నిత్యావసర సరుకులు, పాలు, కరెంట్, పశువులకు దాణా లేక అనేక అవస్థలు పడుతున్నారని, అక్కడ ప్రజలు వారికి కనీస అవసరాలు కూడా ప్రభుత్వం తీర్చలేకపోయిందని, గత వారం రోజులుగా అంధకారం లో ఉన్నామని, కనీసం పసిపిల్లలకు పాలు లేక అనేక సమస్యలు ఎదుర్కొన్నామని వాపోయారని ఆ వరద బాధిత కుటుంబాలు అన్నాయి. రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారని, ప్రభుత్వం వెంటనే స్పందించి, వారికి తగిన న్యాయం చెయ్యాలని, పంట నష్ట పోయిన వారికి ఆర్థిక సాయం చేయాలని, వరద ప్రభావిత ప్రాంత కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన రెండు వేలరూపాయలు సరిపోదని, ప్రతి కుటుంబానికి కనీసం పదివేలు ఆర్థిక సహాయం చెయ్యాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వెంగలదాసు దానయ్య, అడ్డాల మధు, మేకా చంద్రకుమారి, సలాది, మారుతి, తోట ఆదినారాయణ, కడిమి ఉమ, లింగోలు రాఘవులు తోట సాయి బాబా, జడ్డు ఫణిద్ర తదితరులు పాల్గొన్నారు.