Search
Close this search box.
Search
Close this search box.

గిరిజ నేతరుల అక్రమ కట్టడాలకు వ్యతిరేకంగా జరిగిన అఖిలపక్ష సమావేశానికి హాజరైన జనసేన పార్టీ నాయకులు

జనసేన

       అరకు ( జనస్వరం ) : హుకుంపేట మండల కేంద్రంలో గిరిజ నేతరుల అక్రమ కట్టడాలకు వ్యతిరేకంగా మరియు ఒకటి డబ్బాయి చట్టం పటిష్టంగా అమలు చేయలని ఆదివారం హుకుంపేట మండల కేంద్రంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగినది.. ఈ యొక్క సమావేశానికి జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జనసేన పార్టీ మాజీ ఎంపీటీసీ సాయిబాబా దురియా, కార్యనిర్వాహన కమిటీ సభ్యుడు ( అల్లూరి జిల్లా) సురేష్, రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే 1 బై 70 చట్టం పటిష్టంగా అమలు చేయాలని, గిరిజనేతరుల అక్రమ కట్టడాలను కూల్చి చేయాలని, అక్రమంగా ఎవరైతే చట్టానికి వ్యతిరేకంగా కట్టడాలు చేపట్టి ఉన్నారు వారిపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.. పాలకుల నిర్లక్ష్యం కారణంగా గిరిజను హక్కులను, చట్టాలను తుంగలో తొక్కుతున్నారని తెలిపారు. గిరిజనేతరుల అక్రమ కట్టడాలపై వైసిపి ప్రభుత్వం వైఖరి ఎంటో స్పష్టంగా చెప్పాలని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. గిరిజనుల కోసం జనసేన పార్టీ ఎల్లవేళలా అండగా నిలుస్తుందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way