Search
Close this search box.
Search
Close this search box.

గ్రామాల్లోకి జనసేనపార్టీ – మాకినీడి శేషుకుమారి

జనసేనపార్టీ

          పిఠాపురం ( జనస్వరం ) : ఉమ్మడి తూ.గో.జిల్లా పిఠాపురం నియోజవర్గం యూ.కొత్తపల్లి మండలం కొండెవరం గ్రామంలో కార్యకర్తల కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తలపెట్టిన మహత్కార్యం క్రియాశీలక సభ్యత ఐదు లక్షల రూపాయల ప్రమాద భీమా మరియు సభ్యత్వ కిట్లు పంపిణీ చేశారు. మాకినీడి శేషుకుమారి చేతుల మీదగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ భారతదేశంలో ఎక్కడ ఏ పార్టీ కూడా తలపెట్టని కార్యక్రమం మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తల కోసం ఐదు లక్షల రూపాయలు భీమా పథకాన్ని తలపెట్టడం జనసైనికులు అదృష్టం అని అన్నారు. అలాగే కౌలు రైతుల కుటుంబాన్ని ఆదుకుని ఆ కుటుంబాలకు భరోసాని కల్పించి రాష్ట్ర వ్యాప్తంగా కష్టం ఉన్నచోట ఎప్పుడూ కూడా అందరిని ఆదుకుంటూ తన వంతు సహాయం చేసి అండగా నిలిచిన మహోన్నత మైన మనిషి మా అధినేత అని కొనియాడారు. అలాగే పార్టీ బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్తలు కష్టపడి కృషిచేయాలని సభ్యత్వం ఉన్నవారు ప్రతి ఒక్కరు మీ ఇంటివారిని మీ పరిశ్రాల ప్రాంతంవారిని గ్రామంలో అందర్నీ జనసేన అధ్యక్షులు ప్రవేశపెట్టిన మనోగతం పుస్తకాన్ని చదివి సారంశాన్ని వారికి వివరించి పార్టీకి గ్రామంలోబలమైన పునాది వేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు, జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు మరియు గ్రామ పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way