Search
Close this search box.
Search
Close this search box.

రైతన్నకు అండగా జనసేనపార్టీ : జనసేన వీరమహిళ కాంతి శ్రీ

రైతన్న

          ఎచ్చెర్ల ( జనస్వరం ) : నియోజకవర్గ జనసేన నాయకురాలు కాంతి శ్రీ గారు అన్నదాతకి జనసేన అండగా ఉంటుందని చెప్పడానికి తాళ్లవలస, లావేరు, వెంకటాపురం మూడు పంచాయతీల్లో పొలంలో పనిచేస్తున్న రైతులు కలవడానికి నేరుగా పొలంలోకి వెళ్లారు. ఈ సందర్భంగా కాంతి శ్రీ రైతులతో మాట్లాడుతూ కౌలు రైతుల కోసం పవన్ కళ్యాణ్ గారు సొంతంగా తన కష్టార్జితంలో నుంచి 30 కోట్ల రూపాయలు ఇచ్చిన విషయం జనసేన పార్టీలో రైతుల కోసం పొందుపరిచిన మేనిఫెస్టో గురించి వివరించారు. అలాగే రైతు పక్షాన జనసేన పార్టీ నిలబడుతుంది అని చెప్పడం జరిగింది. కాంతి శ్రీ రైతులు మాట్లాడుతూ ఎరువులు విత్తనాలు సబ్సిడీలు లేవు, ఈ ycp ప్రభుత్వం పూర్తిగా రైతుల్ని కష్టాల్లోకి నెట్టేసిందని రైతులు చెప్పుకొచ్చారు‌. ఈ కార్యక్రమంలో లావేరు మండల నాయకులు కోల రాజేష్ గారు, కాకర్ల బాబాజీ, శ్రీను , కోటి గారు, సతీష్ గారు, నీలాం నాయుడు, అలాగే జనసైనికులు వీరమహిళలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way