Search
Close this search box.
Search
Close this search box.

బ్లడ్ క్యాన్సర్ తో ఇబ్బంది పడుతున్న పేద మైనారిటీ కుటుంబానికి జనసేన పార్టీ ఆర్థిక సాయం.

       శ్రీకాళహస్తి ( జనస్వరం ) : బ్లడ్ క్యాన్సర్ తో ఇబ్బంది పడుతున్న పేద మైనారిటీ కుటుంభానికి జనసేన పార్టీ ఆర్థిక సాయం.*శ్రీకాళహస్తి పట్టణం రాజీవ్ నగర్ కి చెందిన పేద మైనారిటీ మహిళ పర్వీన్ గారి కుమారుడు రెహ్మాన్ బ్లడ్ క్యాన్సర్ తో బాధ పడుతున్నాడన్న విషయం శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా గారు జగనన్న కాలనీల సందర్శనకు వెళ్ళినపుడు తెలియజేయగా, స్పందించిన వినుత కోటా గారు ఇంటికి వచ్చి కలవమని చెప్పడంతో ఈరోజు శ్రీకాళహస్తి పట్టణం లోని వినుత గారి ఇంటికి వచ్చి కలిసి ఆరోగ్య పరిస్థితి తెలియజేశారు. ప్రతి నెల ట్రీట్మెంట్ కోసం చెన్నై హాస్పిటల్ కి వెళ్ళాలని తెలిపారు. హాస్పిటల్ లో చికిత్స ఉచితంగా అందుతున్నా వృత్తి రీత్యా బీడీలు చుట్టే పనిలో కుటుంబం గడవడం కాస్ట తరం అయ్యిందని బాబు ట్రీట్మెంట్ కోసం వెళ్ళిరావడనికి డబ్బులు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నట్టు తెలిపారు. సమస్య తెలుసుకున్న వినుత గారు ప్రతి నెల వెళ్లి రావడానికి కావలసిన ఆర్థిక సాయం 5,000 రూపాయలు ప్రతి నెల అందిస్తామని హామీ ఇచ్చారు. ఈనెల వెళ్లి రావడానికి అయ్యే ఖర్చు 5,000 రూపాయలు పర్వీన్ గారికి అందచేశారు. ఏ కస్టం వచ్చినా జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారు అండగా ఉంటారని బరోసా ఇవ్వడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way