ఆముదాలవలస నియోజకవర్గంలో జనసేనపార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

    ఆముదాలవలస, (జనస్వరం) : జనసేనపార్టీ ఆవిర్భావంతో తాడిత పీడిత బాధిత ప్రజలకు ప్రయోజన కలుగుతుందని ఆముదాలవలస జనసేన నియోజకవర్గ ఇంఛార్జ్ పేడాడ రామ్మోహన్ రావు అన్నారు. శనివారం జనసేనపార్టీ 9 వ వార్షికోత్సవం సందర్భంగా ఆముదాలవలసలో ఉన్న పార్టీ కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ జనసేన ఆవిర్భావంతో పేద ప్రజలకు మేలు కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా 14న విజయవాడలో జరుగు ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా సమావేశంలో జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ పార్టీ అజెండాను ప్రకటించడం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో అధికార పార్టీ అరాచక పాలనకు వ్యతిరేకంగా పోరాటమే జనసేన లక్ష్యమని అన్నారు. 2024లో జరిగే సాధారణ ఎన్నికల్లో జనసేన పూర్తిస్థాయిలో పోటీకి సిద్ధం అవుతుందని దీంట్లో జనసేన అభ్యర్థులు విజయం తధ్యమని పలికారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు పైడి మురళీమోహన్రావు, పి.ప్రసాదరావు, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way