Search
Close this search box.
Search
Close this search box.

ఆచంట నియోజకవర్గంలో ఘనంగా జనసేనపార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

   ఆచంట, (జనస్వరం) : పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గము వల్లూరు గ్రామంలో గ్రామ సర్పంచ్ శ్రీమతి నేలపూడి బేబీ రాంమోహన్ గారిచే గ్రామ పారిశుధ్య కార్మికులకు బియ్యం పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీమతి నేలపూడి బేబీ రాంమోహన్ మాట్లాడుతూ జనసేనపార్టీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని పారిశుధ్య కార్మికులుకు బియ్యం ఇవ్వడం వారికి అండగా జనసేన ఉండడం శుభపరిణాం అని అన్నారు. జనసేనపార్టీ జిల్లా సెక్రెటరీ చిట్టూరి శ్రీనివాస్ మాట్లాడుతూ జనసేనపార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా ఆచంట నియోజకవర్గంలో ఐదు రోజులు వేడుకలు నిర్వహించడం జరుగుతుందని అందలో భాగంగా నాల్గొవ రోజు పారిశుధ్య కార్మికులకు బియ్యం పంపిణి చేసామన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యతిధిగా విచ్చేసిన జిల్లా సంయుక్త కారదర్శి రావి హరీష్ మాట్లాడుతూ జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు రెల్లి సామజిక వర్గాన్ని స్వీకరించారని అందులో భాగంగా పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకుని జనసైనికులు పారిశుధ్య కార్మికులకు బియ్యం పంపిణీ చేసి వారికి అండగా ఉండడం జనసేన గొప్పదనం అన్నారు. అలాగే ఐదవ రోజు జనసేనపార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా ఆచంట నియోజకవర్గంలో  వల్లూరు జనసేనపార్టీ స్తూపం వద్ద జనసైనికులు కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ జిల్లా సెక్రెటరీ చిట్టూరి శ్రీనివాస్ మాట్లాడుతూ జనసేనపార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆచంట నియోజకవర్గం గత ఐదు రోజులు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఐదు రోజుల పండుగలా జరుపుకోవడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేనానాయుకులు కడిమి శ్రీనివాస్, యేడిద తేజా విగ్నేశ, యేడిద బాలు, అడబాల అజయ్ బాబు, తోట ఫణిద్ర, యేదడిద సాయి, కొసన రేవంత్, తానేటి వాకో, యేడిద మణికంఠ, దివి పండు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way