Search
Close this search box.
Search
Close this search box.

రోడ్డు పక్కన శరణార్ధులకు దుప్పట్లు పంపిణీ చేసిన జనసేనపార్టీ తూర్పుగోదావరి జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీమతి సుంకర కృష్ణవేణి

శరణార్ధుల

   కాకినాడ, (జనస్వరం) : శీతాకాలంలో రోడ్డు పక్కన శరణార్ధుల కోసం నిన్న రాత్రి కాకినాడలో దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేసిన జనసైనికులు.ఈ కార్యక్రమానికి జనసేన వీరమహిళ, జనసేనపార్టీ జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీమతి సుంకర కృష్ణవేణి శ్రీనివాస్ గారి చేతులమీదగా ప్రారంభించి శరణార్ధులకు దుప్పట్లు అందివ్వడం జరిగింది. వారు మాట్లాడుతూ జనసేన కుటుంబంలో నా ఆత్మీయ సోదరులు మంచితనం, మానవత్వంతో ఎప్పుడు సమాజ శ్రేయస్సుకోసం ఆలోచించే యువనాయకులు బుచ్చిరాజు మల్లిరెడ్డి, కర్రీ చక్రధర్, వల్లభ శెట్టి వెంకటేష్, గంగాధర్, వీరబాబు గార్లు ఈ దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టి వారి మానవత్వ విలువలు చాటుకున్నారు. సొంత తోబుట్టువులా నన్ను ఎప్పుడు ఆదరిస్తూ, గౌరవించి, ఎప్పుడు నీ వెంట మేమున్నామంటూ ప్రోత్సహించే సోదర జనసైనికులకు శ్రీ మతి సుంకర కృష్ణవేణి గారు ఈ సందర్భంగా  ధన్యవాదములు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way