అగ్నిప్రమాదంలో ఇళ్లు దెబ్బ తిన్న కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించిన జనసేనపార్టీ, తదేకం ఫౌండేషన్

తదేకం ఫౌండేషన్

           అమలాపురం ( జనస్వరం ) : బండారు లంకలో నిన్న జరిగిన అగ్ని ప్రమాదంలో ఇల్లు కోల్పోయిన ఐదు కుటుంబాలను  జనసేనపార్టీ అమలాపురం నియోజకవర్గం ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు  పార్టీ నాయకులతో కలిసి అగ్నికు ఆహుతైన ఇళ్ళను పరిశీలించారు. జనసేనపార్టీ, తదేకం ఫౌండేషన్ వారి సహకారంతో తాత్కాలిక సహాయంగా ఒక్కో కుటుంబానికి 8 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ప్రభుత్వం తక్షణమే ప్రతి కుటుంబానికి పక్కా ఇల్లు నిర్మించాలని అదేవిధంగా వారి జీవనాధారమైన చేనేత మగ్గాలు కూడా అగ్నిలో ఆహుతి అయ్యాయని తక్షణమే వారికి చేనేత మగ్గాలు అందజేయడమే కాకుండా వారికి నష్టపరిహారం అందజేయాలని డిమాండ్ చేయడం జరిగింది. ప్రభుత్వం 15 రోజుల్లో వారికి పూర్తిస్థాయిలో న్యాయం చేయాలని అలాకాని పక్షంలో జనసేన ప్రత్యక్షంగా పూనుకుని బాధితుల ఇళ్ల నిర్మాణానికి ముందుకు వస్తుందని రాజబాబు గారు అన్నారు ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ నాయకులు చిక్కాల సతీష్, బట్టు పండు, పిండి రాజా, కుంపట్ల రమేష్, ముత్తబత్తుల శ్రీను, తూము రమేష్, పొనకల ప్రకాష్, అరళ్ళపల్లి దుర్గ, బండి మణికంఠ, తులా సతీష్, తులా కృష్ణ, కొప్పుల వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way