Search
Close this search box.
Search
Close this search box.

పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వారోత్సవాల సందర్భంగా జనసేన NRI సేవా సమితి కువైట్ వారి ఆధ్వర్యంలో 13వ రోజు సేవా కార్యక్రమాలు

జనసేన NRI సేవా సమితి కువైట్

             జనసేన NRI సేవా సమితి కువైట్ ఆధ్వర్యంలో జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలో భాగంగా 13వ రోజు రైల్వే కోడూరు మండలంలోని దేశెట్టిపల్లి గ్రామంలో జరిగింది. సాయి ఈశ్వరమ్మ వృద్ధాశ్రమంలో 30 మందికి శ్రీ తొగురు హరినాథ్, ప్రకాశ్ పద్మావతమ్మ దాతగా అన్నదాన వితరణ కార్యక్రమం జరిగింది. కరోనా సమయంలో వృద్ధాశ్రమంలో అభాగ్యులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించినందుకు సాయి ఈశ్వరమ్మ వృద్ధాశ్రమం నిర్వాహకురాలు పుష్పలత గారు హర్షం వ్యక్తం చేశారు. ఆమె మాట్లాడుతూ జనసేన ఎన్నారై సేవా సమితి కువైట్ చేస్తున్న సేవలు ఎంతో అభినందనీయని, ఈ సందర్భంగా అధ్యక్షులు శ్రీ రామచంద్ర నాయక్, ఉపాద్యక్షులు శ్రీ పగడాల అంజన్ కుమార్, నాయకులు శ్రీ కంచన శ్రీకాంత్, శ్రీ మాదాసు నరసింహ, దండు చంద్రశేఖర్, దండు సురేష్ లకు తన అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మర్రి రెడ్డిప్రసాద్, నగిరిపాటి మహేష్, ఉత్తరాది శివకుమార్, కొర్లకుంట గిరి, బాలిశెట్టి వెంకటేష్, కటారు నరేష్, కలిశెట్టి మణి, బాలిశెట్టి నాగరాజు తదితరులు పాల్గొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way