జనసేన NRI సేవా సమితి కువైట్ అధ్యక్షులు శ్రీ రామచంద్ర నాయక్ గారి ఆధ్వర్యంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన మాసోత్సవాలలో భాగంగా శనివారం ఉదయం బుడంపాడు గ్రామంలోని ఇన్నయ్య నగర్ లో నిరుపేద మహిళలకు బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ వడ్రాణం మార్కండేయ బాబు గారు, 16వ డివిజన్ కార్పోరేటర్ శ్రీమతి దాసరి లక్ష్మీ దుర్గా గారు, గుంటూరు జిల్లా లీగల్ సెల్ చైర్మన్ శ్రీ అమ్మినాయుడు గారు, పార్టీ నాయకులు శ్రీ ఉప్పు వెంకట రత్తయ్య గారు, పార్టీ నాయకులు శ్రీ చింతా రేణుకా రాజు గారు విచ్చేశారు. నిరుపేద మహిళలకు ఉచితంగా బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మార్కండేయ బాబు గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం, పార్టీ బలోపేతానికి విశేష కృషి చేస్తున్న జనసేన ఎన్నారై సేవా సమితి కువైట్ సేవలు అభినందనీయం అని అన్నారు. లాక్ డౌన్ సమయంలో కువైట్ నుండి ప్రత్యేక విమానాల ఏర్పాటు చేసి కువైట్ లో నివసిస్తున్న భారతీయులను స్వస్థలాలకు క్షేమంగా చేర్చడం ఎంతో గొప్ప కార్యకమని, ప్రభుత్వాసుపత్రులకి ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, వివిధ ప్రాంతాలలో మాస్కులు, నిత్యావసర వస్తువులు పంపిణీ స్ఫూర్తిదాయకం అని బాణవతి రామచంద్ర నాయక్, పగడాల అంజన్ కుమార్, దండు చంద్రశేఖర్, కంచన శ్రీకాంత్, మాదాసు నరసింహలను అభినందించారు.18వ డివిజన్ కార్పోరేటర్ శ్రీమతి దాసరి లక్ష్మీ దుర్గా గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా సమాజసేవకు, జనసేన అభివృద్ధి కొరకు ఎన్నారైలు చేస్తున్న కార్యక్రమాలు ఎంతో ప్రశంసనీయమని, మన 18వ డివిజన్ నందు ఈ నిత్యావసర వస్తువుల పంపిణీ నిర్వహించినందుకు దాతలు కుంచా నాగరాజు, నగేష్, మారంరెడ్డి రాము, కేశం ఆనందయ్యలకు శుభాకాంక్షలు తెలిపారు. లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు శ్రీ అమ్మి నాయుడు గారు మాట్లాడుతూ రామచంద్ర నాయక్ గారి ఆధ్వర్యంలో నిర్విరామంగా మూడోవ సంవత్సరం కూడావ 30రోజులు 30ప్రాంతాలు 30 సేవా కార్యక్రమాలు నిర్వహణ అద్భుతంగా ఉందన్నారు. లీగల్ సెల్ తరపున తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని స్పష్టం చేశారు. పార్టీ నాయకులు ఉప్పు వెంకట రత్తయ్య గారు మాట్లాడుతూ కువైట్ లో ఉంటూ మాతృభూమిపై మమకారంతో ఎన్నారై మిత్రుల చేస్తున్న సేవలు శ్లాఘినీయనిమన్నారు. పార్టీ నాయకులు చింతా రేణుకారాజు గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను బలంగా ప్రజలలోకి బలంగా ముందుకు తీసుకు వెళ్తున్న జనసేన ఎన్నారై సేవా సమితి సభ్యులందరికీ తన శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ నాయకులు కొండూరు కిషోర్ గారు మాట్లాడుతూ అంబేద్కర్, పూలే భావాలను జనసేన పార్టీతోనే సాధ్యమని, పవన్ కల్యాణ్ గారి నాయకత్వంలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని ఎన్నారైలు మరోసారి రుజువు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెలిదండి కోటేశ్వరరావు, విష్ణుమొలకల ఆంజనేయులు, ఆకుల వీరరాఘవయ్య, నాంచారయ్య, పావులురికోటి, నారిశెట్టి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com