విద్యుత్ ఘాతం వ్యక్తికి అండగా జనసేన NRI ధవళ వెంకటగిరిబాబు ఆర్ధిక సహాయం
టెక్కలి మండలం బూరగాం పంచాయతీ పరిధిలోని మాదినివానిపేటకి చెందిన దడియాల రాంబాబును శనివారం జనసేన పార్టీ టెక్కలి నియోజకవర్గ నాయకులు కూరాకుల యాదవ్, అట్టాడ శ్రీధర్ లు పరామర్శించారు. హైదరాబాద్ కు వలస కూలీగా వెళ్లి భవన నిర్మాణ కార్మికుడిగా దడియాల రాంబాబు రెండు నెలల క్రితం విద్యుత్ హైటెన్షన్ తీగలు తాకడంతో భవనంపై నుంచి కింద పడిపోయారు. చికిత్స అనంతరం చావుబతుకులతో పోరాడి కోలుకుంటున్న ఆ పేద కుటుంబానికి టెక్కలి కి చెందిన ఎన్ అర్ ఐ ధవళ వెంకటగిరిబాబు ₹5000/- ఆర్ధిక సహాయం చేశారు. ఈ నేపథ్యంలో యాదవ్, శ్రీధర్ లు రాంబాబు ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులకు 5 వేలు నగదు మొత్తాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో రాయి సునీల్, పాసుపురెడ్డి సోమేశ్, తోట శ్యాం, దారపు కిషోర్ రెడ్డి, దడియాల మోహన్, దడియాల పవన్, గేదెల దినేష్, గేదెల శేఖర్, బొడ్డేపల్లి వెంకటేష్, హనుమంతు దిలీప్ తదితరులు పాల్గొన్నారు.