Search
Close this search box.
Search
Close this search box.

సింగన్నపాలెం గ్రామంలో సొంత నిధులతో రోడ్డు వేయించిన జనసేన MPTC విక్రమ్

సింగన్నపాలెం

         శ్రీకాకుళం ( జనస్వరం ) : ఆముదాలవలస నియోజకవర్గం, సింగన్నపాలెం గ్రామం వద్ద జనసేన నాయకులు కిలోమీటర్ వరకూ గుంతలు పడిన రోడ్డును మరమ్మత్తులు చేయించారు. జనసేన MPTC గా గెలిచిన విక్రమ్ 30 వేలు రూపాయలు పెట్టి సొంత నిధులతో రోడ్లును మరమ్మతులు చేశారు. ఆయన మాట్లాడుతూ గెలిపించిన ఈ గ్రామానికి నేను ఎప్పుడు అండగా ఉంటానాని అన్నారు. అలానే ఈ కార్యక్రమం విజయవంతం అవ్వడానికి మరియు నేను విజయం సాధించడానికి కారణం కొత్తకోట నాగేంద్ర, కోరుకొండా మల్లేశ్వరావు, మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య కారణమైన కొల్ల జైరాం, తులగాపు మౌళి, తిరుపతి, నరేష్, సంగం, సంతోష్, మరియు సింగన్నపాలెం గ్రామ యువతకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ప్రతి వాహనదారులకి ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పి ప్రభుత్వ తప్పొప్పులను వివరిస్తూ రోడ్డు జాగ్రత్తలు గూర్చి చెప్పారు. స్థానిక అధికారును పూర్తి రోడ్లు వేయాలని డిమాండ్ చేశారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way