జె.జి.ఆర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో జనసేన మెగా మెడికల్ క్యాంపు

    పిఠాపురం ( పిఠాపురం ) : పిఠాపురం ఇన్చార్జ్ ఉదయ్ శ్రీనివాస్ ఆదేశాలతో… జోగా రమణ పి.ఎస్. ఎన్. మూర్తి టీం సహకారంతో మెడికల్ క్యాంప్ నిర్వహించారు. జె.జి. ఆర్. హాస్పిటల్స్ పిఠాపురం వారి మెగా మెడికల్ క్యాంపు మల్లం గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున చుట్టుపక్కల గ్రామ ప్రజలు పాల్గొని జనసేన పార్టీ నిర్వహించిన ఈ క్యాంపులో సుమారు 470 మంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. మల్లం గ్రామ పెద్దలు మాట్లాడుతూ మా గ్రామానికి జనసేన పార్టీ అధ్యక్షులు వారు మెడికల్ క్యాంపు నిర్వహించడంపై చాలా ఆనందకరంగా ఉందని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా సేవా కార్యక్రమంలో ముందు ఉంటారని ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈసారి మా గ్రామం అంతా కూడా జనసేన వైపు చూస్తామని చెప్పడం మా జనసేన నాయకులకు ఆనందం కలిగించింది. జగన్ పోవాలి పవన్ రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ పిఠాపురం ఇన్చార్జి తంగళ్ళ ఉదయ శ్రీనివాస్, జనసేన మల్లం నాయకులు రాసంశెట్టి కన్యాకరావు, బుర్రా విజయ్, యండ్రపు శ్రీనివాసరావు, బుర్రా రాంబాబు, కొండపిల్లి కొండారావు, కొప్పిరెడ్డి నాని, సిద్ధి నాని, పాటి రాంబాబు, పిఠాపురం టౌన్ నాయకులు పిండి శ్రీనివాస్, టైల్స్ బాబి, పెంకే జగదీష్, వినుకొండ అమ్మాజీ, నామా శ్రీకాంత్, ముప్పన రత్నం, పబ్బిరెడ్డి ప్రసాద్, పెదిరెడ్ల భీమేశ్వరావు & పి.ఎస్.ఎన్. మూర్తి నాయకులు జనసైనికులు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way