Search
Close this search box.
Search
Close this search box.

జనసేన అంటే ఒక భరోసా – జనసేన నాయకులు బొర్రా వెంకట అప్పారావు

        సత్తెనపల్లి రూరల్, (జనస్వరం) : గోరంట్ల గ్రామం నాయీ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన పుల్లచెరువు పుల్లయ్య తీవ్రమైన అనారోగ్యంతో సత్తెనపల్లి జనసేనపార్టీ కార్యాలయాన్ని సంప్రదించిన విషయాన్ని పార్టీ శ్రేణులు స్థానిక జనసేనపార్టీ నియోజకవర్గ నాయకులు బొర్ర వెంకట అప్పారావు దృష్ఠికి తీసుకెళ్ళగా, వెంటనే వారికి ఆర్ధిక సాయం అందించారు. ఈ ఉదంతంతో జనసేనపార్టీ కార్యాలయం అంటే పౌరసేవా కేంద్రమని మరోసారి ఋజువైంది. ఈ సందర్భంగా బొర్రా వెంకట అప్పారావు మాట్లాడుతూ జనసేనపార్టీ అంటేనే ఒక భరోసా అని గర్వంగా చెప్పారు. పతనం అవుతున్న రాష్ట్రాన్ని పవన్ కల్యాణ్ మాత్రమే గాడిన పెట్టగలరని తెలిపారు. రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీకి ఓటు వేసి పవన్ కల్యాణ్ ను ముఖ్యమంత్రిని చేసుకుందామని కోరారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కోమ్మిశెట్టి సాంబశివరావు, మున్సిపల్ 7 వార్డు కౌన్సిలర్ రంగిశెట్టి సుమన్, సత్తెనపల్లి రూలర్ మండల అధ్యక్షుడు నాదెండ్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way