Search
Close this search box.
Search
Close this search box.

ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుడి కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన జనసేన నాయకులు

    పెడన, (జనస్వరం) : పెడన పట్టణం 17 వ వార్డులో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుని మృతిచెందిన చేనేత కళాకారుడు కాశం పద్మనాభం – నాగ లీలావతి, దంపతులు మరియు వారి కుమారుడు రాజా నాగేంద్రం గారి కుటుంబాన్ని జనసేన పార్టీ చేనేత వికాస విభాగం ఛైర్మెన్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాస్ మరియు పెడన జనసేన నాయకులు శ్రీ యడ్లపల్లి రామ్ సుధీర్ పరామర్శించారు. తక్షణ సహాయం కింద రామ్ సుధీర్ 25,000 /- వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని జనసేన పార్టీ చేనేత వికాస విభాగం ఛైర్మెన్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాస్ గారి చేతుల మీదుగా మృతుల కుటుంబానికి అందచేశారు. అలాగే మచిలీపట్నం నియోజకవర్గం ఇంఛార్జ్  బండి రామకృష్ణ (R.K) 10,000 /- వేల రూపాయల ఆర్థిక సహాయం అందచేశారు. బాధిత కుటుంబానికి జనసేన పార్టీ అన్నీ విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పెడన జనసేన నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way