Search
Close this search box.
Search
Close this search box.

అనారోగ్యంతో బాధపడుతున్న పాపకు ఆర్థిక సహాయం అందించిన జనసేన నాయకులు

జనసేన

      కళ్యాణదుర్గం ( జనస్వరం ) : అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం బోయలపల్లి గ్రామంలో చిన్న పాపకు అనారోగ్య సమస్య వల్ల హాస్పిటల్ లో ఉండి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తల్లిదండ్రులకు శెట్టూరు మండలం మాకోడికి గ్రామం జనసేన నాయకుడు గురు స్వామి మానవతా దృక్పథంతో చిన్నారికి 5000 రూపాయలు వైద్య ఖర్చుల కోసం ఆర్థిక సహాయం చేయడం జరిగింది.. పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో సమాజంపై ప్రేమతో కష్టాల్లో ఉన్న వాళ్లకి అండగా నిలబడాలనే పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఎంతోకొంత మన వంతు బాధ్యతగా సహాయం చేయుట జరిగింది అని జనసేన నాయకుడు గురుస్వామి తెలియజేశారు. ఈ సందర్భంగా గురుస్వామిని అభినందనలు తెలియజేసిన జిల్లా కార్యదర్శి లక్ష్మీనరసయ్య, సంయుక్త కార్యదర్శి బాల్యం రాజేష్, కళ్యాణదుర్గం మండల కన్వీనర్ షేక్ మొహిద్దీన్, సెట్టూరు మండలం కన్వీనర్ లేపాక్షి ఈరన్న, రామలింగ, ప్రేమ్ కుమార్, మురళి మొదలైన జనసేన కార్యకర్తలు అభినందనలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way