పింఛ డాం వద్ద సందర్శించిన జనసేన నాయకులు

పింఛ డాం

    రాజంపేట ( జనస్వరం ) : పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అన్నమయ్య జిల్లా టి. సుండుపల్లి మండల పరిధిలోని పింఛ డాం వద్ద సందర్శించిన జనసేన నాయకులు.  జనసేనపార్టీ నాయకులు రామ శ్రీనివాస్ మాట్లాడుతూ మిచౌంగ్ తుఫాన్ ద్వారా డాం లోకి వచ్చిన నీటిని నిల్వ ఉంచలేని పరిస్థితుల్లో ఈ రాష్ట్ర వైసీపీ ప్రభుత్వం, పాలక పక్షం వారి చేతకానితనంతో పాటు అధికారులు నిర్లక్ష్యం వల్ల పించ డాం దిగువన ఉన్న నదీ పరీవాహక పరిసరాల్లో ఆయా చుట్టుపక్కల ప్రాంతాలలోని రైతాంగానికి సాగునీరు అందక మరియు ప్రజలు త్రాగడానికి గుక్కెడు మంచి నీరు కూడా కరువై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో వరద తాకిడికి విపత్తు వల్ల పించ డాం కుడి వైపు మట్టి కట్ట తెగిపోయి మూడోవ సంవత్సరం జరుగుతున్న కనీసం 5% నిర్మాణ పనులు కూడా చెయ్యలేదు. ప్రస్తుత వైసీపీ ప్రజాప్రతినిధులు తమ మాటల్లో మాత్రం ప్రభుత్వం వెంటనే పూర్తి స్థాయిలో నిర్మాణం కోసం కృషి చేస్తున్నాం అని వాగ్దానాలతో అబద్ధాలు చెబుతూ పబ్లిసిటీ కోసమే ప్రజలకు నమ్మపలుకుతారు తప్ప ఇక్కడ చూస్తే ఆచరణలో మాత్రం అభివృద్ధి పనులు శున్యం రాబోయే సార్వత్రిక ఎన్నికలలో వీరికి తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం ద్వారా ఫించ డాం ను అన్ని రకాలుగా పూర్తి స్థాయిలో అభివృధ్ధి చేసి రైతులకు సాగునీరు అందించడంతో పాటుగా త్రాగడానికి మంచి నీరు కూడా అందేలా చేస్తామని ప్రజలందరికీ అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, అభిమానులు, చుట్టుపక్కల గ్రామస్థులు, వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way