పాలకొండలో టిడిపి రిలే దీక్షకు జనసేన నాయకుల మద్దతు

పాలకొండ

      పాలకొండ ( జనస్వరం ) : స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ కు నిరసనగా పాలకొండ నియోజకవర్గ శాసన సభ సభ్యులు నిమ్మక జయకృష్ణ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షకు పాలకొండ జనసేన పార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు జనసేన నాయకులతో కలిసి దీక్షా శిబిరం వద్దకు వెళ్లి పూల మాల వేసి మద్ధతు తెలిపారు. ఈ సందర్భంగా గర్భాన సత్తిబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా జనసేన అధినేత  పవన్ కళ్యాణ్ గారు జనసేన టీడీపీ కలిసి ముందుకు వెళ్తాయని ప్రకటించారు. అతని నిర్ణయానికి కట్టుబడి ఈ రోజు టీడీపీ చేస్తున్న దీక్షకు జనసేనపార్టీ తరుపున మద్దతు తెలపడం జరిగింది అని అన్నారు. వైసీపీ ప్రభుత్వం శాంతి భద్రతలను విఘాతం కలిగించే విధంగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని అక్రమ కేసులు పెడుతున్నారు అని, ఇంకో ఆరు నెలలలో ఈ రాక్షస పాలన అంతంకాక తప్పదు అని అన్నారు. అధికారంలో ఉండి వైసీపీ చేసిన అవినీతిని బయటికి తీసి జైలుకు పంపే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way