విద్యుత్ సమస్య పరిష్కరించాలంటూ వినతి పత్రం అందించిన జనసేన నాయకులు

విద్యుత్

        ఎమ్మిగనూర్ (జనస్వరం ) : జనసేన పార్టీ ఎమ్మిగనూర్ నియోజకవర్గ ఇంచార్జ్ రేఖ గౌడ్ గారి ఆదేశాల మేరకు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో నెలకొన్న విద్యుత్ సమస్యపై జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి సుపరిండెంట్ డాక్టర్ బాలయ్య గారికి వినతి పత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా మండల అధికార ప్రతినిధి రాహుల్ సాగర్, రాష్ట్ర చేనేత విభాగం రాష్ట్ర కార్యదర్శి రవి ప్రకాష్ మండల ప్రధాన కార్యదర్శి బజారి మాట్లాడుతూ ఎమ్మిగనూరులో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రిలో రోజుకు కొన్ని వందల మంది చికిత్స కొరకు వస్తుంటారని అలాంటి సందర్భంలో విద్యుత్ కొరత ఉండడం ఎంతో పుణ్యమని అభిప్రాయపడ్డారు. అదేవిధంగా అధిక సంఖ్యలో నర్సులు, వార్డ్ బాయ్ సెక్యూరిటీ లేకపోవడం వల్ల ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులు చాలా ఇబ్బందికి గురి అవుతున్నారని ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ సమస్యల్ని పరిష్కరించే వలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో షబ్బీర్ వెంకటేష్, కృష్ణ, మంజు రాజశేఖర్, వినయ్, బద్రి, శివ, బాలు, శీను, రామాంజి, సూరి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way