తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పార్లమెంట్ పరిధిలో స్థానిక ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, జనసేన పార్టీ అభ్యర్థులను నామినేషన్స్ వేయకుండా చాలా ప్రాంతాలలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఇబ్బందులు పెడుతున్నారు.. మంత్రులు స్వయంగా ఏకగ్రీవాలు చేయాలనే పిలుపునివ్వడంతో వైసీపీ వాళ్ళు ఈ విధమైన చర్యలకి పాల్పడుతున్నారని అన్నారు. ఇటువంటివి జరగకుండా, మా అభ్యర్థులకి తగిన భద్రత కల్పించాలని బీజేపీ, జనసేన పార్టీలు శాంతిభద్రతలకు ఎటువంటి విఘాతం కలగకూడదని హామీ కోరుతున్నామన్నారు. అదేవిధంగా వైసీపీ, టీడీపీ నుంచి హామీ తీసుకోవాలని కోరుతూ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ కాకినాడ వారిని వారి కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందించిన జనసేన పార్టీ PAC సభ్యులు, కాకినాడ పార్లమెంట్ ఇంచార్జ్ పంతం నానాజీ గారు మరియు బీజేపీ కాకినాడ పార్లమెంట్ అధ్యక్షులు చిలుకూరి రాంకుమార్ గారు.. ఈ కార్యక్రమం లో కరెడ్ల గోవింద్ గారు, ఆకులమణి గారు, తెలగం శెట్టి వెంకటేశ్వర రావు గారు, బీజేపీ నాయకులు మామిడాల శ్రీనివాస్ గారు తదితరులు పాల్గొన్నారు..
